భారతదేశం, ఫిబ్రవరి 12 -- మాఘ పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళాలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం తెల్లవారుజామున పవిత్ర స్నానం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుండి మహా కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌ ప్రకటించారు. అత్యవసర, అవసరమైన సేవలకు మినహాయింపు ఇచ్చారు.

మహా కుంభమేళాలో మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు స్నానమాచరించారు. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. భారీ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలులో ఉన్నాయి. ఇప్పటికే నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. అయితే కొందరు ప్రయాగ్‌రాజ్ సరిహద్దులు మూసివేశారని పుకార్లు లేపారు. ఈ విషయంపై ప్రయాగ్‌రాజ్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమా...