భారతదేశం, మే 28 -- టీడీపీ మహానాడులో తొలిరోజు మంగళవారం రూ.21.53 కోట్ల విరాళాలు అందాయని వేదికపై నుంచి చంద్రబాబు ప్రకటించారు. పార్టీకి విరాళాలు అందించిన వారిని అభినందించారు. తెలుగు దేశం పార్టీ నిధికి దాతలు ఆన్లైన్‌లో కూడా విరాళాలు పంపవచ్చని చంద్రబాబు సూచించారు.

తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో నడపాల్సింది కార్యకర్తలేనని, ప్రతి ఒక్కరు తమ శక్తిమేర విరాళాలను అందించాలని పిలుపునిచ్చారు. ఆ డబ్బు పార్టీ కార్యక్రమాలకు ఖర్చుచేస్తామని.. మిగిలిన సొమ్ము పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఖర్చుచేస్తామన్నారు.

ఝార్ఖండ్ విపత్తు సమయంలో డెహ్రాదూన్ నుంచి దిల్లీ, అక్కడ నుంచి హైదరాబాద్, విజయ వాడ, విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేక విమానాలు, కార్లు ఏర్పాటుచేసి బాధితులను ఇళ్లకు చేర్చామని, ప్రకృతి విపత్తులు, సంక్షోభ సమయాల్లో కూడా పార్టీ నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస...