భారతదేశం, మే 28 -- తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా 30 ఏళ్లుగా కొనసాగుతున్న చంద్రబాబు కడప మహానాడులో మరోమారు ఎన్నిక కానున్నారు. 1995లో తొలిసారి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు .. అప్పటి నుంచి ఆ పదవిలో కొన సాగుతున్నారు.

టీడీపీ అధ్యక్ష పదవికి ఎన్నికలను ప్రతి రెండేళ్లకు ఒక సారి నిర్వహిస్తారు. 2014 రాష్ట్ర విభజన వరకు ఉమ్మడి ఏపీలో టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ శాఖలతో కలిపి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

కడపలో జరుగుతున్న 34వ మహానాడులో మరోమారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో కలిపి ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 30ఏళ్లు పూర్తవుతాయి. చంద్రబాబు పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004లో టీడీపీ ఓడిపోయింది. పదేళ్ల పాటు అధికా...