భారతదేశం, మే 3 -- ంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మళ్ళీ మార్చింది. 3 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలపై ఈ మార్పు జరిగింది. ఏప్రిల్ 2025లో కూడా బ్యాంక్ ఇలాంటి మార్పునే చేసింది. ఈసారి బ్యాంక్ కొన్ని నిర్దిష్ట టర్మ్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. కొత్త రేట్లు మే 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. వడ్డీ రేట్ల మార్పు తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉన్న ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 3.50శాతం నుండి 7.10 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 390 రోజుల ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ రేటు లభిస్తుంది. ఇది 7.10 శాతం.

3 కోట్ల కంటే తక్కువ విలువ గల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పీఎన్‌బీ తగ్గించింది. 180 నుంచి 270 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.25 శాతం నుంచి 6శాతానికి తగ్గించబడింది. అదేవిధంగా 271 ...