భారతదేశం, మే 26 -- తెలంగాణలో ఫార్ములా ఈ-కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. నోటీసులపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

"ఫార్ములా ఈ-రేస్ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపులు అయినప్పటికీ, నేను కచ్చితంగా ఏసీబీకి సహకరిస్తాను. నేను వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు యూకే, యూఎస్ఏ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను. తిరిగి రాగానే విచారణకు హాజరవుతాయని ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశాను"-కేటీఆర్

రాజకీయ ప్రతీకార దాహానికి, దానిని సాధించడానికి ఎలాంటి సంకోచం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న తీరుకు అభినందించాలని కేటీఆర్ ఎద్దేవా చేశార...