భారతదేశం, జూలై 8 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 10 పాయింట్లు పెరిగి 83,442 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 0.3 పాయింట్లు పెరిగి 25,461 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 83 పాయింట్లు పడి 56,949 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 322.66 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,739.90 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 25,400 వద్ద కీలక సపోర్ట్​ ఉంది. దాని దిగువకు పడితే నిఫ్టీ50లో అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. 25,250-25,100 వరకు వెళ్లొచ్చు. 25,500 వద్...