భారతదేశం, ఫిబ్రవరి 22 -- నాగర్ కర్నూల్‌లో కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా జరిగిన గొడవతో రెండు నెలల చిన్నారి చనిపోవడం కలకలం రేపింది. జాతరకు వెళ్లిన భక్తులతో అమర్యాదగా ప్రవర్తించడం, దాడి జరగడం, తోపులాటలో రెండు నెలల పాప ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనలో పోలీసులు గతంలో కేసు నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు కేసు నమోదైంది.

బాధితుల కథనం ప్రకారం.. కుమ్మెర మల్లన్న జాతర ఉత్సవాల్లో భాగంగా అదే గ్రామానికి చెందిన చంద్రకళ, గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కుమార్తె, దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. టికెట్ విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి, భక్తురాలు చంద్రకళకు మధ్య వివాదం నడిచింది. గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డితోపాటుగా మరికొందరు నిర్వాహకులు ప్రవేశ ద్వ...