Hyderabad, మే 28 -- ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ తుడరుం (Thudarum). ఈ రివేంజ్ థ్రిల్లర్ థియేటర్లలో దుమ్ము రేపిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని డైరెక్ట్ చేసిన తరుణ్ మూర్తి గతంలో తీసిన సినిమాల గురించి తెలుసుకోండి. ప్రస్తుతం అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి.

మలయాళం డైరెక్టర్ తరుణ్ మూర్తి తీసింది మూడు సినిమాలే. కానీ అన్నీ బ్లాక్‌బస్టర్లే. అందులోనూ ఒక్కో మూవీ ఒక్కో జానర్లో తీసి సక్సెస్ సాధించడం అన్నది మామూలు విషయం కాదు.

తొలి సినిమా క్రైమ్ థ్రిల్లర్ కాగా.. రెండోది ఓ డ్రామా. ఇక ఈ ఏడాది మోహన్‌లాల్ తో తుడరుం అనే రివేంజ్ థ్రిల్లర్ తీసి మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని గత సినిమాలకు ఓటీటీల్లో డిమాండ్ పెరిగింది.

తరుణ్ మూర్తి తొలిసారి 2021లో ఆపరేషన్ జావా సినిమాత...