Hyderabad, మే 26 -- ఓటీటీలోకి మరో కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వస్తోంది. ఈ సినిమా పేరు అజ్ఞాతవాసి. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. జనార్దన్ చిక్కన్న డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రంగాయన రఘు లీడ్ రోల్లో నటించాడు. మరి ఈ మూవీ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుంది? ఎందుకు చూడాలో తెలుసుకోండి.

కన్నడలో సప్త సాగరాలు దాటి మూవీని నిర్మించిన హేమంత్ రావ్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ఈ అజ్ఞాతవాసి. నిజానికి కొవిడ్ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్నా.. థియేటర్లు మూతపడటంతో రిలీజ్ వాయిదా వేశారు. మొత్తానికి ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా బుధవారం (మే 28) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీలో మరింత మెరుగ్గా రాణిస్తుందని భావిస్తున్నారు. సైనైడ్ మూవీ ఫేమ్ రంగ...