భారతదేశం, మే 23 -- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఉదంతం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ తరువాత ఆ ప్రియుడి సహకారంతో రహస్యంగా ఆ మృతదేహాన్ని సమీపంలోని మురుగు కాలువలో పడేసింది. ఈ ఘటన థానేలో చోటు చేసుకుంది.

తాగుడుకు బానిసైన భర్తకు ఫుల్ గా మద్యం తాగించి, అనంతరం హత్య చేసి కాలువలో పడేసిన వివాహిత, ఆమె ప్రియుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్తను హత్య చేసిందన్న ఆరోపణలపై పూనమ్ కాళిదాస్ వాఘ్మారే (28)ను, ఆమెకు సహకరించిన ఆరోపణలపై ఆమె ప్రియుడు సురేష్ హరిప్రసాద్ యాదవ్ (24)లను రబాలే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు కలిసి పూనమ్ భర్త కాళిదాస్ వాఘ్మారే (30)ను హత్య చేసినట్లు, మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది.

పోలీసులు త...