భారతదేశం, మే 3 -- తెలంగాణ ఆర్టీసీ.. దేశంలోనే స్మార్ట్‌గా మారుతోంది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు తరలిస్తూ.. మెరుగైన సేవలందించడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ప్రగతి రథం.. ప్రజా సేవాపథం అనే నినాదంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే చిల్లర కొరతను అధిగమించడానికి క్యాష్ లెస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

తెలంగాణ ఆర్టీసీ తాజాగా.. ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ ఉన్న కీచైన్లను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని స్కాన్‌ చేస్తే పూర్తి సమాచారం మన అరచేతిలో ఉంటుంది. ప్రస్తుతం ప్రతీఒక్కరు స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారు. దీంతో అందుకు తగ్గట్టు ఆర్టీసీ సమాచారాన్ని చేరువ చేస్తోంది. ఆర్టీసీ ప్రత్యేకంగా తయారు చేసిన కీచైన్‌పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్‌ చేయగానే.. స్క్రీన్‌పై సంస్థ అందించే సేవలు కనిపిస్తాయి.

ఈ క్యూఆర్ కోడ్ కీచైన్లలో.. పది ...