Andhrapradesh,amaravati, మే 17 -- రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సదరమ్ స్లాట్ బుకింగ్స్ పై కూడా కీలక ఆదేశాలను జారీ చేశారు.

శుక్రవారం వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబందిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సదరం సర్ట్ఫికెట్లు, PMJAY వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్ పై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ కి చర్యలు చేపట్టాలన్నారు.

స్లాట్ బుకింగ్ చ...