Hyderabad, మార్చి 13 -- మధ్యాహ్నం భోజనం చేశాక ఎంతో మందికి ఆవలింతలు రావడం మొదలవుతాయి. నిద్ర మత్తు కమ్మేస్తూ ఉంటుంది. కానీ ఆఫీసులో పనిచేయాలి. ఓ పక్క నిద్రమత్తు, మరో పక్క పని. ఈ రెండూ సరిగా చేయలేక సతమతమైపోతూ ఉంటారు ఎంతో మంది ఉద్యోగులు. ఆహారం తిన్న తర్వాత సోమరితనంగా, నిద్ర వచ్చేలా ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?

కొంతమంది నిద్రమత్తు ఆపుకోలేక ఆఫీసులోనే పవర్ న్యాప్ కూడా తీసేస్తారు. అలా పవర్ న్యాప్ తీసుకునే అవకాశం అన్నీ ఆఫీసుల్లో ఉండదు. ఆ అవకాశమూ అందరికీ రాదు. పవర్ న్యాప్ తీసుకున్న తర్వాత ఈ నిద్ర పోతుంది. కానీ కొంతమంది మధ్యాహ్న భోజనం తర్వాత పూర్తిగా బద్ధకంగా ఉంటారు. అలసిపోయినట్లు భావిస్తారు. దేనిపైనా దృష్టి పెట్టలేరు.

ఇలాంటి బద్ధకాన్ని నివారించడానికి ప్రజలు తరచుగా టీ, కాఫీ, సిగరెట్లు వంటి వాటిని తాగుతారు. పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్...