Hyderabad, ఆగస్టు 23 -- బ్యూటిపుల్ హీరోయిన్ అంజలి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విశాల్ 35వ ప్రాజెక్ట్‌లోకి హీరోయిన్ అంజలి వచ్చేశారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న విశాల్ ఇప్పుడు తన కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు.

చివరగా 'మద గద రాజా' అంటూ అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ లతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిపించింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో సినిమా రాబోతోంది. విశాల్ 35 ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో అంజలి కీలక పాత్రను పోషించబోతోన్నారు. ఈ మేరకు విశాల్ 35 ప్రాజెక్ట్‌లోకి అంజలి వచ్చేశారన్నట్టుగా టీమ్ ప్రకటించింది. ఈ మూవీకి ఎన్.బి. శ్...