భారతదేశం, ఫిబ్రవరి 9 -- ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ విశాల్ దద్లానీ కొత్తగా వచ్చే గాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. పాటలు పాడే అవకాశం కోసం మంత్రులు, రాజకీయ నాయకులతో ఫోన్ చేయించే కల్చర్ తనకు అస్సలు నచ్చదని, అలా చేస్తే వారి నంబర్లను బ్లాక్ చేస్తానని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సీరియస్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్ వైరల్ అవుతోంది.

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం, సిఫార్సుల గురించి తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇండియన్ ఐడల్ జడ్జి విశాల్ దద్లానీ (Vishal Dadlani) దీనిపై ఘాటుగా స్పందించాడు. సోమవారం (ఫిబ్రవరి 9) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెడుతూ.. పని కోసం రాజకీయ నాయకులను వాడేవారిని తాను సహించనని తేల్చిచెప్పాడు.

కొత్తగా వచ్చే సింగర్లకు సలహా ఇస్తూ విశాల్ ఇలా రాసుకొచ్చాడు. "ఎవరో ఒక మంత్రి గారితోనో, వారి సెక్రటరీ...