Hyderabad, మే 16 -- ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్ రామాయణ. రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిర్మాతల్లో ఒకరిగా ఉన్న యశ్.. రావణుడిగా నటిస్తున్నాడు. ఇప్పుడతని భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు ఇండియా టుడే రిపోర్ట్ వెల్లడించింది.

అత్యంత భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. వచ్చే ఏడాది తొలి పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం.. ఇందులో మండోదరి పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తోంది. రావణుడిగా నటిస్తున్న యశ్ పక్కన ఆమె కనిపించబోతున్నట్లు ఇండియా టుడే రిపోర్టు తెలిపింది. ఇప్పటికే ఆమె షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు ఈ రిపోర్టు వెల్లడించింది.

"రామాయణంలో మండోద...