భారతదేశం, జూన్ 10 -- ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్ పై అంతస్తులో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి, అతని ఇద్దరు పిల్లలు భవనం పై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందారు.

ఉదయం 10 గంటల సమయంలో ఎంఆర్వీ స్కూల్ సమీపంలోని సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్ పై అంతస్తు మొత్తాన్ని మంటలు చుట్టుముట్టాయి. ఆ అపార్ట్మెంట్లోని నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. వారిలో ఒక వ్యక్తి, ఇద్దరు కుమారులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ భవనం పై నుంచి దూకారు. కానీ, తమ ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. పై నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. వారి వయస్సు, ఇతర వివరాలు వెంటనే అందుబాటులో లేవు. అగ్నిప్రమాదానికి గల కారణాలు కూడా వెంటనే తెలియరాలేదు.

ఉదయం 10...