Hyderabad, జూన్ 8 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది. దివంగత, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, హీరో రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు.

ఈ కొత్త ప్రాజెక్టును దర్శకుడు అజయ్ భూపతి స్వయంగా తెరకెక్కించినున్నారని తాజా సమాచారం. ఆర్ఎక్స్ 100 వంటి బ్లాక్‌బస్టర్‌తో తన ప్రతిభను చాటిన అజయ్ భూపతి ఆ తర్వాత సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ "మంగళవారం" మూవీతో మళ్లీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం "మంగళవారం 2" ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి.

మంగళవారం 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగానే మరో హై-ప్రొఫైల్ లాంఛింగ్ ప్రాజెక్ట్‌కి అజయ్ భూపతి శ్రీకారం చుట్టారు. ఘట్టమనేని కుటుంబం నుంచి కొత్త హీరోను అజయ్ భూపతి లాంచ్ చేయనున్నారు...