భారతదేశం, మే 27 -- మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఆర్కేను 127వ నిందితుడిగా చేర్చారు.

వైసీపీ హయాంలో... 2021 అక్టోబర్‌ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై...వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉండడంతో...అప్పట్లో కేసు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును సీఐడీకి అప్పగించింది.

టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి పోలీసులు హత్యాయత్నంతోపాటు పలు నేరాలపై...వైసీపీ కీలక నేతలను, కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో పాటు వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌తోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువుర...