భారతదేశం, మే 20 -- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ-కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ సంయుక్తంగా మీడియాకు వివరించారు.

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు... ఐదు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి సిఫారసులపై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంధన, రోడ్లు, పారిశ్రామిక నీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన భూములను కేటాయించడం ద్వారా ఏపీలో ప్రాజెక్టుల స్థాపనను వేగవంతం చేసేందుకు ఈ ఆమోదం దోహదపడుతుంది.

ఈ ఐదు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.9,246 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశమే కాకుండా దాదాపు 7,766 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మరో రెండు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.2,261 కోట్లు పెట్టుబడులకు రావడమే కాకుండా దాదాపు ...