Telangana, జూన్ 6 -- తెలంగాణలో వ్యవసాయ భూముల నిర్వహణకు భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మండలాల్లో ఈసేవలు ప్రారంభమయ్యాయి. దీని ఆధారంగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటు పలు సేవలు అందుతున్నాయి.

తాజాగా ఈ పోర్టల్ కు సంబంధించి ప్రభుత్వం మరో కొత్త అప్డేట్ ఇచ్చింది. పోర్టల్ లో భూ మిత్ర ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ ఆప్షన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను పొందవచ్చు.ఆ ఆప్షన్ ద్వారా. భూ భారతిలో యూజర్లు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చేలా ఈ చాట్‌ బాట్‌ పని చేస్తుందని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

రైతులు ప్రాథమికంగా ఇచ్చే వివరాలతో సరైన సమాచారం ఇవ్వడానికి ఈ భూ మిత్ర ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. హెల్ప్‌ డెస్క్‌ కింద ఈ చాట్‌బాట్‌(భూ మిత్ర)ను వినియోగించనున్నారు.

ఈ సేవలన...