భారతదేశం, మే 19 -- తెలంగాణలో భూప‌రిపాల‌న‌ను మ‌రింత మెరుగుప‌ర‌చ‌డానికి కచ్చిత‌మైన భూరికార్డుల‌ను రూపొందించ‌డం ద్వారా వివాదాల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.

భూభార‌తి చ‌ట్టంలో రిజిస్ట్రేష‌న్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాపును జ‌త‌ప‌ర‌చ‌డం త‌ప్పనిస‌రి చేశామ‌ని ఈ విధానాన్ని వీలైనంత త్వర‌గా అమ‌లులోకి తెచ్చేందుకు పెద్దసంఖ్యలో స‌ర్వేయ‌ర్లు అవసరం ఉందన్నారు.

ఇందుకోసం ఐదువేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కానికి ఈ నెల 17వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌గా 10,031 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని తెలిపారు.

లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కంపై సోమ‌వారం మంత్రి పొంగులేటి స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల శిక్షణ‌కు సంబంధించిన అన్ని ఏర్పా...