Hyderabad, ఏప్రిల్ 30 -- భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోతోంది. విడాకుల కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెళ్లయిన పదేళ్ల తరువాత ఎక్కువ మంది డైవర్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి వారి మధ్య శారీరక సాన్నిహిత్యం లేకపోవడం కూడా కారణమేనని తెలుస్తోంది.

భార్యాభర్తల మధ్య పదేళ్ల తరువాత ఒకరిపై ఒకరికి లైంగిక కోరికలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల మొదల స్లీప్ డివోర్స్ తీసుకుంటున్నారు. అంటే చెరో చోట నిద్రపోతున్నారు. కొన్నాళ్లకు పూర్తిగా విడాకులు తీసుకుని ఎవరి దారి వారి చూసుకుంటున్నారు.

ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య లైంగిక దూరం పెరుగుతుందో. వారు బయట తమ అవసరాలు తీర్చే వారి కోసం వెతుకుతారు. కొత్త ఆకర్షణకు లోనవుతారు. ఇది కూడా వారిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం అవుతోంది.

భార్యాభర్తలు ఒకే గొడుగు కింద సంతోషంగా జీవిస్తున్నట్టు కనిపిస్తునప్పటికీ. వారిలో...