భారతదేశం, మే 12 -- భార్యాభర్తల మధ్య గొడవ.. బావమరుదుల ప్రాణాలు తీసింది. తమ అక్కతో గొడవ పడుతున్నాడని.. బావపై ఇద్దరు బావమరుదులు గొడవకు దిగారు. అది పెద్ద ఘర్షణగా మారింది. చివరికి ఆ బావ, తన ఇద్దరు బావమరుదులను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో జరిగింది.

కిముడు కృష్ణ, కిముడు రాజులను వాళ్ల బావ గెన్ను ఒకేసారి శూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందపురం సీఐ చింతా వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం....