భారతదేశం, మే 7 -- భారతదేశం ఉగ్రవాదంపై తన సైనిక వ్యూహాన్ని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ప్రదర్శించింది. ఆపరేషన్ సిందూర్ కింద మొదటిసారిగా భూ, వాయు, నౌకాదళాలు ఏకమై పాకిస్తాన్ పీఓకేలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ఒకే రాత్రి లక్ష్యంగా చేసుకున్నాయి.

ఇది భారతదేశపు 'త్రిశూల్ ప్రహార్'. ఇందులో జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తైబా, హిజ్బుల్ వంటి సంస్థల యొక్క ప్రధాన శిక్షణా శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ సాహసోపేతమైన మిషన్‌లో ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగా 90 కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ ఆపరేషన్ ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగింది. ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా హస్తం ఉంది. ఈ దాడికి లష్కర్ ముసుగు సంస్థ ది రెసిస్టెన్స...