భారతదేశం, మే 8 -- భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ రద్దయ్యేలా ఉంది. ఆ దిశగా బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఐపీఎల్ 18 మధ్యలోనే రద్దయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపై శుక్రవారం (మే 9) బీసీసీఐ చర్చించే అవకాశముంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో లీగ్ కొనసాగడం సందేహమే.

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ 'ఆపరేషన్ సింధూర్'లో భాగంగా మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడుతోంది. ఇతర ప్రాంతాలపైనా దాడులు చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా గురువారం (మే 8) ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను మధ్యలోనే రద్దు చేశారు.

ఒకవైపు మాత్రమే ఫ్లడ్ లైట్లను ఉంచి ప్లేయర్స్, ఫ్యాన్స్ ను స్టేడియం నుంచి పంపించేశ...