భారతదేశం, మే 27 -- అల్కాటెల్ తన కొత్త వి3 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇందులో వీ 3 అల్ట్రా, వీ 3 ప్రో, వీ 3 క్లాసిక్ అనే మూడు మోడళ్లు ఉన్నాయి. ఈ డివైజెస్ లో టీసీఎల్ అభివృద్ధి చేసిన పేటెంట్ పొందిన ఎన్ఎక్స్ టీపీ డిస్ప్లే టెక్నాలజీ ఉంటుంది. భారతీయ స్మార్ట్ ఫోన్లలో ఎన్ఎక్స్ టీపీ టెక్నాలజీ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.

అల్కాటెల్ లాంచ్ చేసిన కొత్త వీ3 సిరీస్ స్మార్ట్ ఫోన్ లలోని డిస్ ప్లేలలోని ఎన్ఎక్స్ టీపీ టెక్నాలజీ డిస్ప్లే రెగ్యులర్ మోడ్, ఇంక్ పేపర్ మోడ్, కలర్ పేపర్ మోడ్, మ్యాక్స్ ఇంక్ మోడ్ అనే నాలుగు విభిన్న వ్యూయింగ్ మోడ్ లను అందిస్తుంది. వినియోగదారులు ఒక సింపుల్ క్లిక్ తో ఈ మోడ్ లను మార్చుకోవచ్చు. చదవడం, బ్రౌజింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి కార్యకలాపాల కోసం వ్యక్తిగతీకరించిన స్క్రీన్ అనుభవాన్ని ఈ టెక్నాలజీ అందిస్తు...