భారతదేశం, మే 12 -- ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు భారత సాయుధ దళాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలతో పాటు ప్రతి దేశ పౌరుడిని ప్రధాని మోదీ అభినందించారు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు మన దేశంలోని తల్లులు, సోదరీమణుల కుంకుమను తుడి చేశారని, అందుకే వారి ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, భారత సైన్యం పెద్ద ఎత్తున ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు.

ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా దెబ్బకొట్టామని చెప్పారు మోదీ. సైనికుల పరాక్రమం, సాహసాలకు సెల్యూట్ చేశారు. భారత్ చర్యలకు పాకిస్థాన్ భయపడిందని ప్రధాని మోదీ అన్నారు. కాల్పుల విరమణకు ప్రపంచాన్ని వేడుకుందన్నారు.

Published by HT Digit...