భారతదేశం, జనవరి 26 -- భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఇరు పక్షాల మధ్య చర్చలు విజయవంతంగా ముగిశాయని, ఒప్పందం దాదాపు ఖరారైందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం ప్రకటించారు.

"చర్చలు సఫలమయ్యాయి.. డీల్ ఫైనల్ అయింది. భారత కోణంలో చూస్తే ఇది ఎంతో సమతుల్యమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఒప్పందం. దీనివల్ల యూరోపియన్ దేశాలతో మన ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం అవుతుంది" అని రాజేష్ అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం ఈ ఒప్పంద పత్రానికి సంబంధించిన న్యాయపరమైన అంశాల పరిశీలన (Legal scrubbing) జరుగుతోందని, ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఒప్పందంపై సంతకాలు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ద్వారా ఇరు ఆర్థిక వ్యవస్థల్ల...