భారతదేశం, మే 2 -- ాక్ హ్యాకర్లు మరోసారి భారత్ వెబ్‌సైట్లపై దాడికి యత్నించారు. పిల్లలు, మాజీ సైనికులు, సంక్షేమ సేవలకు సంబంధించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే దీనిపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు వేగంగా స్పందించి.. నిర్వీర్యం చేశాయి. సైబర్ గ్రూప్ HOAX1337, నేషనల్ సైబర్ క్రూ అనే గ్రూపులు ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్), నగ్రోటా, సుంజువాన్ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకున్నాయి. దీని ద్వారా పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన 26 మందిని ఎగతాళి చేస్తూ రెచ్చగొట్టే కంటెంట్‌ను పోస్ట్ చేసే ప్రయత్నం చేశారు.

పిల్లలు, మాజీ సైనికులు, ఇతర అమాయకులకు సంబంధించిన వెబ్‌సైట్లను దాడి చేసేందుకు పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న హ్యాకర్లు పదేపదే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ వెబ్‌సైట్‌ను, భారత వైమా...