భారతదేశం, మే 9 -- హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆపరేషన్ సిందూర్ వివరాలను కేంద్రం వెల్లడించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ క్షిపణులు, డ్రోన్లను భారత వైమానిక దళం అడ్డుకుంది.

భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 ప్రాంతాల్లో పాకిస్థాన్ 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించిందని భారత్ శుక్రవారం తెలిపింది. భటిండా మిలిటరీ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక 'పాకిస్థాన్ సాయుధ మానవరహిత వైమానిక వాహనాన్ని పంపారు. ఆ ప్రయత్నాన్ని విఫలం చేశాం.' అని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు తెలిపారు.

పాకిస్థాన్ దాడికి ప్రతిస్పందనగా ఆ దేశం అంతటా నాలుగు వైమానిక రక్షణ స్థావరాలపై భారతదేశం సాయుధ డ్రోన్లను ప్రయోగించిందని, ఒ...