భారతదేశం, మే 3 -- మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 8వ తేదీ లోపు పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణులు.. హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఇప్పటికే మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ సీఈవో, ఛైర్‌పర్సన్‌ జూలియో ఈవెలిన్‌ మోర్లీ భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ప్రధాన కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలతో అట్టహాసంగా పోటీలు ప్రారంభం కానున్నాయి.

12వ తేదీన నాగార్జునసాగర్‌, బుద్ధవనం ప్రాజెక్టు సందర్శన ఉంటుంది.

13న చార్మినార్‌ లాడ్‌బజార్‌లో హెరిటేజ్‌ వాక్‌ ఉంటుంది. అదే రోజు చౌమెుహల్లా ప్యాలెస్‌లో మ్యూజికల్‌ కాన్సర్ట్, వెల్‌కమ్ డిన్నర్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు.

14న ఒక గ్రూప్ వరంగల్‌ వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట సందర్శనకు వె...