భారతదేశం, మే 10 -- ారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గత రెండు రాత్రులు భారత్ పై డ్రోన్‌తో దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించగా అది విఫలం అయింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు భారత్ పై ఉగ్రదాడి జరిగితే దాన్ని యుద్ధంగా పరిగణించి తదనుగుణంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పాక్ ఉగ్రవాద దాడులను భారత్ ఇకపై సహించబోదని ప్రభుత్వ నిర్ణయం స్పష్టం చేసింది. ఇప్పటికైనా పాక్ ఉగ్రదాడులను విరమించుకోకపోతే భారత్ దాన్ని యుద్ధంగా భావించి కఠినంగా వ్యవహరిస్తుంది. ఏప్రిల్ 22న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ టీఆర్‌ఎఫ్ పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడింది. ఇందులో 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. భారత పర్యాటకులను తమ మతాన్ని అడిగి మరి కాల్చారు. దీని కారణంగా దేశవ్యాప్తంగా పాకి...