భారతదేశం, ఆగస్టు 26 -- భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసుల సంయుక్త ఆపరేషన్లో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఇద్దరు కీలక సభ్యులు అరెస్టు అయ్యారు. కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో సోమవారం వాహనాల తనిఖీ చేస్తుండగా వీరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
అరెస్టయిన వారిలో ఓయం భూడి అలియాస్ లోకేష్ (30) ఏరియా కమిటీ మెంబర్ (ACM) కాగా, పోడియం రామే అలియాస్ శిల్ప (25) సాధారణ పార్టీ సభ్యురాలు. వీరిద్దరూ భద్రతా దళాలపై పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై బాంబులు అమర్చడం, పోలీసు బృందాలపై మాటు వేసి దాడులు చేయడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల లక్ష్యంగా..: పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం, వీరు కొవండే పోలీస్ స్టేషన్కు 150 మీటర్ల దూరంలో 4 కిలోల ఐ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.