భారతదేశం, మే 28 -- అప్పు, క‌ళ్యాణ్‌ల శోభ‌నం గ‌దిని కావ్య‌, రాజ్ క‌లిసి డెక‌రేట్ చేస్తారు. రాజ్ తెచ్చిన పూలు చాలా మిగిలిపోవ‌డంతో అత‌డిపై ఫైర్ అవుతుంది కావ్య‌. వేస్ట్ అయిన పూల గురించి ఆలోచిస్తున్నారు కానీ..ఒక సారి క‌ళ్లు తెరిచి చూస్తే రూమ్ ఎంత రొమాంటిక్‌గా ఉందో క‌నిపిస్తుంద‌ని కావ్య‌పై సెటైర్లు వేస్తాడు రాజ్‌. కాస్తైనా రొమాంటిక్ ఫీల్ ఉండాల‌ని కావ్య‌ను ఆట‌ప‌ట్టిస్తాడు.

ఇప్పుడంతా రొమాంటిక్‌గా ఆలోచించి ఏం చేస్తామ‌ని కావ్య అంటుంది. నా మ‌న‌సులో మీకు చెప్పొచ్చు...మీ మ‌న‌సులో మాట నాకు చెప్పొచ్చు అని రాజ్ అంటాడు. నా మ‌న‌సులో ఏం లేద‌ని కావ్య క‌ఠినంగా స‌మాధాన‌మిస్తుంది. అబ‌ద్ధ‌మ‌ని రాజ్ అంటాడు.

నా గురించి ఏం ఆలోచించ‌డం లేదా అని కావ్య‌ను అడుగుతాడు రాజ్‌. ఏం ఆలోచించాల‌ని త‌డ‌బ‌డుతూ కావ్య బ‌దులిస్తుంది. మీ క‌ళ్లు మ‌న మ‌ధ్య ఉన్న బంధాన్ని గురించి చెబుతు...