Hyderabad, మే 1 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ గతం మర్చిపోయినా కూడా తనకోసం ఎలా పరితపించాడో యామినికి చెబుతుంది కావ్య. రాజ్ తన పుట్టింట్లో అడుగుపెట్టాడు. నువ్ అల్లిన కట్టు కథ కథలా మిగిలిపోయింది. ఆయన మనసు ఎప్పుడో మారిపోయింది. ఇక ఆయనకు గతం గుర్తురావడమే అని కావ్య అంటుంది.

అది నేను జరగనివ్వను. త్వరలోనే మా పెళ్లి జరగబొతుంది. పెళ్లి పత్రికలు ప్రింట్ అయిపోయాయి. ముహుర్తం కూడా పెట్టేశాం. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా మా పెళ్లికి రాజ్ కూడా ఒప్పుకున్నాడు. ముహుర్తం గురించి అడిగితే నా ఇష్టమే తన ఇష్టం అన్నాడు. నీ కల కలగానే మిగిలిపోతుంది. నీ మెడలో ఉన్న తాళి తెగిపోతుంది అని యామిని అంటుంది.

సరే, నువ్ అనుకున్నదే నిజమనుకుందాం. నీతో పెళ్లికి ఒప్పుకున్నాడే అనుకుందాం. మరి నీతో ఉండాల్సిన మనిషి నాతో రెస్టారెంట్‌లో కాఫీ తాగడానికి ఎందుకు వచ్చారు....