భారతదేశం, ఫిబ్రవరి 14 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 956వ ఎపిసోడ్ లో అప్పు, కల్యాణ్ లను కిడ్నాప్ చేయిస్తుంది రుద్రాణి. అది రాజ్ చేయించినట్లు ధాన్యలక్ష్మికి వీడియో పంపిస్తుంది. దీంతో ఇంట్లో రచ్చ జరుగుతుంది. ఆస్తి కోసమే ఇలా చేసినట్లు ఆమె ఆరోపించడంతో వాళ్లను తిరిగి తీసుకొచ్చే వరకు తాము కూడా ఇల్లు వదిలి వెళ్తామని రాజ్ అంటాడు.

బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఫిబ్రవరి 14) ఎపిసోడ్ లో రుద్రాణిని రేఖ, రాహుల్ నిందించే సీన్ తో మొదలవుతుంది. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ కాలేదంటారు.

ఆ ఇంటికి వారసులే లేకుండా చేస్తానన్నావ్.. కానీ ఇప్పుడు వాళ్లు ఆస్తే లేకుండా చేస్తున్నారు.. కావ్య ట్రస్ట్ ఆలోచన చేయడం, దానికి అందరూ తలూపడం జరిగిపోయింది.. ధాన్యలక్ష్మి మాత్రమే అడ్డుపడింది అని రాహుల్ చెబుతాడు. అలా జరిగితే మనకు చిల్లిగవ్వ కూడ...