Hyderabad, జూన్ 7 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అడవిలో దొరికిన పళ్లను రాజ్ తీసుకొచ్చి కావ్యకు ఇస్తాడు. అవి తిన్న రాజ్, కావ్య ఇద్దరికి మత్తు వస్తుంది. తల తిరుగుతుంది. కన్యాకుమారి కనపడద దారి అనే పాట వస్తుంటే ఇద్దరు మత్తులో తూగుతారు. మత్తులో తూగిన రాజ్, కావ్య అక్కడే నిద్రపోతారు. వాళ్లను కిల్లర్ గ్యాంగ్ చూస్తుంది. లేట్ ఎందుకు లేపేద్దామని కత్తి పట్టుకుని ముందుకు వెళ్తాడు కిల్లర్.

మరోవైపు అప్పు వాళ్లు రాజ్, కావ్యను వెతుకుతుంటారు. కావ్యను యామిని ఆర్డర్ ఇచ్చిన కిల్లర్ పొడిచినట్లు చూపిస్తారు. కట్ చేస్తే.. మరుసటి రోజు ఉదయం దుగ్గిరాల ఇంట్లో అంతా టెన్షన్ పడుతుంటారు. మీరు ఎంత ప్రయత్నించినా వాళ్లు మీకు దొరకరు. యామిని చెప్పినదాని బట్టి చూస్తే ఆ రౌడీలు కావ్యను ఫినీష్ చేసి ఉంటారు. కావ్య శవం ముందు కూర్చుని రాజ్ ఏడుస్తూ ఉంటాడు అని రుద్రాణి అనుకు...