భారతదేశం, ఫిబ్రవరి 15 -- సినిమా తారలు ఎక్కడికి వెళ్లినా కెమెరా కళ్లు వారిని వెంబడిస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ ఉత్సాహం హద్దులు దాటి సెలబ్రిటీల అసహనానికి కారణమవుతుంది. తాజాగా బిగ్ బాస్ హిందీ 17 ఫేమ్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా ఖాన్ పాపరాజీల (ఫోటోగ్రాఫర్లు) ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు.

ఆదర్శ్ గౌరవ్, షనయ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ 'తూ యా మైన్' (Tu Yaa Main) సినిమా ప్రీమియర్ షోకు ఆయేషా ఖాన్ హాజరయ్యారు. అక్కడ రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు ఆయేషా ఖాన్ ఫోజులిస్తుండగా ఒక ఫోటోగ్రాఫర్ ఆమెను వెనుక వైపు నుంచి షూట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన ఆయేషా ఖాన్ వెంటనే ఫోజులు ఆపేసి సదరు ఫోటోగ్రాఫర్‌ను నేరుగా ప్రశ్నించారు.

"గౌరవం సంపాదించుకోవాలన్నా, దానిని పోగొట్టుకోవాలన్నా అది మీ చేతుల్లో...