భారతదేశం, జూన్ 27 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1000 పాయింట్లు పెరిగి 83,756 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 304 పాయింట్లు వృద్ధిచెంది 25,549 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 586 పాయింట్లు పెరిగి 57,207 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 12,594.38 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 195.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

జూన్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 4821.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 44150.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ...