భారతదేశం, జనవరి 4 -- ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు శనివారం అదుపులోకి తీసుకున్నాయి. కారకాస్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే 'ఫోర్ట్ టియునా' సైనిక స్థావరంలోని తమ నివాసంలో మదురో దంపతులు నిద్రిస్తుండగా, అమెరికా కమాండోలు మెరుపు దాడి చేసి వారిని బంధించారు. ఈ మేరకు ఓ అమెరికా మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది.

ఈ సైనిక చర్యకు 'ఆపరేషన్​ బ్సల్యూట్ రిజాల్వ్' అని అమెరికా పేరు పెట్టింది. అగ్రరాజ్య ఆర్మీకి చెందిన అత్యంత శక్తివంతమైన 'డెల్టా ఫోర్స్' ఈ మిషన్‌ను నిర్వహించింది. వీరికి ఎఫ్​బీఐ సహకరించింది. కేవలం 30 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ మొత్తం పూర్తయింది! ఈ దాడిలో అమెరికా సైనికులు ఎవరూ మరణించలేదని అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. "ఒక కంచుకోట లాం...