భారతదేశం, జూన్ 5 -- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మృతుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 13 ఏళ్ల బాలిక కూడా ఉండగా, 17, 19 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు ఉన్నారు. అహ్మదాబాద్ లో 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంగళవారం ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అనంతరం, ఆర్సీబీ టీమ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించింది. ఈ కార్యక్రమానికి అనూహ్యంగా లక్షలాది మంది అభిమానులు తరలిరావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది.

నిర్వహణ లోపాలు, అనూహ్యంగా భారీగా ప్రజలు తరలిరావడం వల్లనే ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల్లో 13 సంవత్సరాల బాలిక కూడా ఉంది. మొత్తంగా మృతులంతా 40 ఏళ్ల లోపు వయస్సున్న యువకులే. మృతుల జాబితాలో...