భారతదేశం, మే 24 -- బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కేరళల్లో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 35 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. వాటిలో 32 బెంగళూరులోనే నమోదయ్యాయి. అయితే, పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. గత 20 రోజులుగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని కర్నాటక ప్రభుత్వం వెల్లడించింది. "2025 లో కోవిడ్ సంబంధిత మరణాలు నమోదు కానప్పటికీ, మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం" అని ప్రజలకు సూచించింది.

గర్భిణులు, పిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. ప్రజలు చేతుల పరిశుభ్రత పాటించాలని, హ్యాండ్ శానిటైజర్లను క్రమం తప్పకుండా ఉపయోగించాలని సూచించారు.

బెంగళూరు రూరల్ జిల్లా...