Hyderabad, ఆగస్టు 14 -- నిరంతరం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచే జీ తెలుగు సగర్వంగా సమర్పిస్తున్న సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి. మొట్టమొదటిసారిగా నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్​ సమర్ఫణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నేతృత్వంలో రూపొందుతోంది.

వారం వారం సినీ ప్రముఖులు గెస్టులుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలువనుంది. టాలీవుడ్​ కింగ్​ నాగార్జున మొదటి అతిథిగా జయమ్ము నిశ్చయమ్మురా విత్​ జగపతి ప్రారంభం కానుంది. ఆగస్టు 17 ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం జీ తెలుగులో ప్రసారం కానుంది.

బుల్లితెరపై మొదటిసారిగా నటుడు జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా విత్​ జగపతి కార్యక్రమంతో వ్యాఖ్యాతగా మారి తనదైన స్టైల్​, కామెడీ టైమింగ్‌​తో ప్రేక్షకులకు వినోదం పం...