భారతదేశం, మే 2 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టం చేశామని గుర్తు చేశారు. చట్టం కన్నా ముందు ఎంపెరికల్ డేటా ప్రామాణికమైన సమాచారాన్ని సేకరించి.. సబ్ కమిటీ వేసినట్టు వివరించారు. ఆ తర్వాత కేబినెట్ అప్రూవల్ తీసుకొని.. శాసనసభ ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు.

'బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని అనుమతి కొరకు కేంద్రానికి పంపే సందర్భంలో.. గవర్నర్ న్యాయపరమైన అంశాలను పరిశీలించి రాష్ట్రపతికి పంపడం జరిగింది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నాయకులం గవర్నర్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పాం. తెలంగాణలో తీసుకున్న కులగణన మోడల్ అద్భుతంగా ఉంది. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం 2025 జన గణనలో.. కులగణన చేస్తామని చెప...