భారతదేశం, మే 25 -- ాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ఇది మాత్రమే కాదు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కుటుంబం నుండి కూడా బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. లాలూ ప్రసాద్ నిర్ణయం వల్ల పార్టీలోనూ, కుటుంబంలోనూ కొత్త గొడవ మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు పాటించడం లేదని బహిష్కరిస్తున్నట్టుగా లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు.

తేజ్ ప్రతాప్ బహిష్కరణ ఆర్జేడీకి ప్రయోజనం చేకూరుస్తుందా లేదా ప్రతిపక్షాలకు కలిసి వస్తుందా రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుస్తుంది. దీనికి ముందు కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ కుటుంబానికి, పార్టీకి మరియు లాలూ ప్రసాద్ యాదవ్ కు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాడు.

బీహార్ రాజకీయాల్లో ఎప్పుడూ ముఖ్యాంశాల్లో ఉండే తేజ్ ప్రత...