Hyderabad, అక్టోబర్ 12 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఐదో వారం పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9లోకి 15 మంది కంటెస్టెంట్స్‌గా వస్తే వారిలో ఇప్పటికీ నలుగురు ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం మిడ్ వీక్‌లో రాయల్ కార్డ్ (వైల్డ్ కార్డ్) ఎంట్రీగా అగ్ని పరీక్ష కంటెస్టెంట్ దివ్య నిఖితా హౌజ్‌లోకి అడుగుపెట్టింది.

అలా హౌజ్‌లో 12 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వారికి ఐదో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ నిర్వహించారు. అయితే, ఒక్క సింగర్ రాము రాథోడ్‌, ఇమ్మాన్యుయెల్‌ను తప్పా మిగతా 10 మంది కంటెస్టెంట్స్ అందరిని బిగ్ బాస్ డైరెక్ట్ నామినేట్ చేశాడు. నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వడానికి వారికి ఇమ్యూనిటీ టాస్క్‌ పెట్టాడు బిగ్ బాస్.

అలా రకరకాలుగా జరిగిన టాస్క్‌లో అంతా సేఫ్ అయ్యారు. కానీ, వారిలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, ఫ్లోర...