భారతదేశం, జూన్ 2 -- ప్రపంచ సుందరి ఒపాల్ సుచత బాలీవుడ్ పై మనసు పారేసుకుంది. థాయ్ లాండ్ కు చెందిన ఈ మిస్ వరల్డ్ 2025 హిందీ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. భారత ఆతిథ్యం గురించి కూడా మాట్లాడింది. మిస్ వరల్డ్ టైటిల్ గెలిచినందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె తన భారత పర్యటన గురించి మాట్లాడుతూ.. "ఖచ్చితంగా భారత్ కు తిరిగి వస్తాను" అని పేర్కొంది.

బాలీవుడ్ సినిమాల గురించి ఒపాల్ సుచత ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. "నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎంతో గర్వంగా ఉంది. థాయ్ లాండ్ కు తొలి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకోవడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నా. నా దేశ ప్రజలను గర్వపడేలా చేశానని అనుకుంటున్నా. అవకాశం వస్తే బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి ఇష్టపడతా. అదొక అద్భుతమైన అవకాశం'' అని ఒపాల్ చెప్పింది. ఆమె వ్యాఖ్యలను ...