Telangana,warangal, మే 10 -- వరంగల్ నగరంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ కొంతమంది న్యూసెన్స్ చేస్తున్నారు. రోడ్లపైనే తీరిగ్గా మందు బాటిల్ ఓపెన్ చేసి, దర్జాగా లాగించేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లగా.. సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వ్యక్తులపై సీరియస్ గా వ్యవహరించాల్సిందిగా పోలీస్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బంది జనావాసాలు, ఓపెన్ ప్లేసుల్లో మద్యం తాగే వ్యక్తులపై కొరడా ఝుళిపిస్తున్నారు. వరంగల్ ట్రై సిటీ పరిధిలో సాయంత్రం అయ్యిందంటే సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది రోడ్డెక్కుతున్నారు. వైన్స్ షాపుల ...