భారతదేశం, మే 15 -- భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బలూచిస్థాన్‌ స్వతంత్రం కావాలన్న డిమాండ్ తీవ్రమైంది. తాజాగా బలూచిస్థాన్‌ స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది. దానికి తగ్గట్టుగా అడుగులు వేసే పనిలో ఉంది.

అయితే అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ అక్కడ ఉన్న ఒక హిందూ దేవాలయాన్ని ప్రస్తావిస్తూ ఇది సనాతన ధర్మానికి చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా అభివర్ణించారు. బలూచిస్థాన్‌ హిందువులకు చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదన్నారు. ఇక్కడ ఉన్న హింగ్లాజ్ మాత ఆలయం 51 పవిత్ర శక్తిపీఠాలలో ఒకటి అని పేర్కొన్నారు. ఉపఖండం విభజనకు ముందు ఈ ప్రాంతంలో హిందువుల పురాతన సాంస్కృతిక ఉనికికి బలూచిస్థాన్ సాక్ష్యంగా ఉందని అస్సాం సీఎం అన్నారు.

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్స్ ప్రావిన్స్‌లో అతిపెద్ద హిందూ పండుగ అయిన హింగ్లాజ్ జాతరను ఇక్కడ జరుపుకొంటార...